మానవుల ఆయుర్దాయం ఎందువలన క్షీణిస్తుంది? పెంపొందాలి(పెరగాలి) అంటే ఏమిచేయాలి?
ఓర్పు, సత్యం పలకడం, కరుణ, శౌచము(శుచి,శుబ్రత), మాతృ పితృ, గురుభక్తి (ఆధ్యాత్మిక గురువు. అలాగని విద్యలు నేర్పించిన గురువుని అవమానించమని కాదు సుమా!), వీటితోపాటు ఆ ఆ వ్యాధుల వలన కలిగే భాధలకు తగిన ఔషదులు సేవించడం, బ్రహ్మచర్యము, మితాహారము, హితవాక్యములు తెలియజెప్పడం, వలన ఆయుష్షువృద్ధి చెందుతున్నది. కేవలం పూర్వ పుణ్యం వలననే ఇటువంటి సదాచార, దురాచార సంపత్తిపై ఆశక్తి, మక్కువ కలుగుతున్నది.
క్రోధము, అహంకారము, అసత్యము, శుచిలేమి, తనవల్లకాని పని భారాన్ని నెత్తిన పెట్టుకున్నా, అపథ్యమైన ఆహారం (పానిపూరి, పిజ్జాలు, బర్గర్లు, సాన్ద్విజ్లు, బయట బళ్లమీద ఈగలు, దోమలు, ధూళి కలగలసిన ఆహారం) స్వీకరించినా, అనాటికానాటికి ఆయుష్షు క్షీణింపజేస్తున్నవి. ఇటువంటి దురాశక్తి గతజన్మ పుట్టుక పాతిత్యం వలననే సంభవిస్తున్నది. పాపాత్ములు ఎక్కువకాలం నరకంలో నివసించి భూలోకంలో అల్పమైన అయుర్ధాయంతో జన్మించి అర్ధంతరం(ప్రమాదంలో కాని, ప్రక్రుతి విపత్తులలో గాని) నశిస్తారు. మరలా యమలోకంలో యమదండనలు అనుభవిస్తారు.
No comments:
Post a Comment